‘బ్యాంక్ మిత్ర’తో ప్రతి నెలా సులభంగా రూ.5 వేలు సంపాదించవచ్చు

Spread the love

  ప్రతి  నెలా స్థిరంగా నెలవారీ ఆదాయాన్ని పొందాలనుకుంటే ఒక మంచి ప్రభుత్వ పథకం ఉంది. ఈ పథకంతో మీరు ఏదైనా ప్రభుత్వ బ్యాంకులో చేరవచ్చు, తద్వార ప్రతి నెల చాలా సంపాదించవచ్చు. ప్రభుత్వరంగ బ్యాంకులు సేవలను అందించడంతో పాటు సామాన్య ప్రజలకు వారితో కలిసి పని చేయడం ద్వారా డబ్బు సంపాదించే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాయి. ఇదే ‘బ్యాంక్ మిత్ర’, దీంతో దేశంలో బ్యాంక్ లేని ప్రజలకు అనేక సేవలను అందిస్తుంది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఎప్పటికప్పుడు బ్యాంక్ మిత్ర కోసం దరఖాస్తులను కోరుతుంది.

ఈ పథకం గురించి..

బ్యాంక్ మిత్ర.. దేశంలోని బ్యాంక్ లేని ప్రజలకు అనేక సేవలను అందిస్తుంది. ముందుగా వినియోగదారులను పరిశీలించి, వారి గుర్తింపును ధృవీకరించడం, అన్ని పత్రాలను సేకరించడం ద్వారా ఖాతాలను తెరవడంలో బ్యాంక్ మిత్రులు వారికి సహాయం చేస్తారు. వారు దరఖాస్తులు, ఖాతా తెరవడం ఫారమ్‌లను దాఖలు చేయడంలో కూడా సహాయం చేస్తారు. బ్యాంకు మిత్రతో మీరు అనేక మార్గాల్లో సులభంగా సంపాదించవచ్చు. ఏదైనా వ్యక్తి ఖాతా తెరవడం, డబ్బు డిపాజిట్ చేయడం, డబ్బు విత్‌డ్రా చేయడం, అతని క్రెడిట్ కార్డ్, బిల్లు చెల్లించడం వంటి పనులు చేస్తే బ్యాంక్ మిత్రకు కమీషన్ లభిస్తుంది. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన (పిఎంజెడివై) కింద బ్యాంకు మిత్రులు అందరికీ రూ. 1.25 లక్షల రుణం కూడా ఇస్తారు. దీనిలో వస్తువుల కోసం రూ.50,000, పని కోసం రూ. 25,000, వాహనం కోసం రుణం రూ. 50,000 ఇస్తారు.

దీని ద్వారా సేవలు అందించడంతో ప్రతి నెలా 2000 నుండి 5000 రూపాయలు బ్యాంక్ మిత్రకు ఆదాయంగా ఇస్తారు. బ్యాంకు మిత్రగా మారాలంటే ప్రభుత్వంతో కలిసి పనిచేయాలన్న మాట.

ఈ ముఖ్యమైన పత్రాలు తప్పనిసరిగా ఉండాలి..

గుర్తింపు రుజువు కోసం, పాన్ కార్డ్ కాపీ, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడి కార్డ్ అవసరం.

అర్హత కోసం 10వ తరగతి మార్కు షీట్, క్యారెక్టర్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

వ్యాపార చిరునామా కోసం విద్యుత్ బిల్లు, టెలిఫోన్ బిల్లు, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ లేదా పాస్‌పోర్ట్ కాపీ ఉండాలి.

పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, బ్యాంక్ పాస్‌బుక్ కాపీ లేదా రద్దు అయిన చెక్కు కూడా తప్పనిసరిగా ఉండాలి.


Spread the love

Leave a Comment

error: Content is protected !!