‘బై నౌ- పే లేటర్’తో జాగ్రత్త..

Spread the love

 ‘ఇప్పుడే కొనండి తర్వాత చెల్లించండి’ అని దీని అర్థం
ఒక చిన్న నిర్లక్ష్యం మిమ్మల్ని అప్పుల ఊబిలోకి లాగుతుందని తెలుసా..

ఇప్పుడు కొనండి.. తరువాత చెల్లించండి.. అంటే ‘బై నౌ- పే లేటర్’ (బిఎన్పిఎల్) సౌకర్యం. అంటే ఇప్పుడే కొనుగోలు చేసి తర్వాత చెల్లించడం.. ఈ సౌకర్యానికి క్రేజ్ నిరంతరం పెరుగుతోంది. గణాంకాలను పరిశీలిస్తే, గతేడాది ఈ సౌకర్యం కింద లావాదేవీల్లో 600 శాతానికి పైగా వృద్ధి నమోదైంది. దీనికి కస్టమర్ బేస్ పెరగడంపై నిపుణులు ఆందోళన ఎ వ్యక్తం చేస్తున్నారు. వారు జాగ్రత్తగా ఉండాలని వినియోగదారులను సూచిస్తున్నారు. అనేది డెట్ ట్రాప్ లాంటిదని హెచ్చరిస్తున్నారు.

ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే భారతీయులలో బై నౌ పే లేటర్ సౌకర్యం క్రేజ్ వేగంగా పెరుగుతోంది. గణాంకాలను పరిశీలిస్తే, గతేడాది ఈ సౌకర్యం కింద లావాదేవీల్లో 600 శాతానికి పైగా వృద్ధి నమోదైంది. అయితే, నిపుణులు దీనిని ఉపయోగించే వినియోగదారులను హెచ్చరిస్తున్నారు, ఈ సేవలను ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండటం కూడా చాలా ముఖ్యం. లేకుంటే అది మిమ్మల్ని అప్పుల ఊబిలోకి లాగేస్తుంది.

రూ.26.83 లక్షల కోట్ల వ్యాపారం

 బిఎన్పిపిఎల్ మార్కెట్ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఫిన్‌టెక్ సంస్థ రేజర్ పే తాజా డేటాను ప్రకారం, 2021 సంవత్సరంలో ఈ లావాదేవీలలో 637 శాతం పెరుగుదల కనిపించింది. వీటికి ఆన్‌లైన్ చెల్లింపుల్లో 104% వార్షిక వృద్ధి కనిపించింది. దీనికి సంబంధించి విడుదలైన ఒక నివేదిక ప్రకారం, ప్రస్తుతం బిఎన్పిపిఎల్ మార్కెట్ విలువ 3 నుండి 3.5 బిలియన్ డాలర్లు (రూ.26.83 లక్షల కోట్లు) ఉంది. ఈ మార్కెట్ ఇలాగే వృద్ధి చెందితే 2026 నాటికి దీని పరిధి 45 నుంచి 50 బిలియన్లకు పెరుగుతుందని నివేదికలో అంచనా వేశారు.

మార్కెట్ పెరిగేకొద్దీ కస్టమర్ల వృద్ధి..

 బిఎన్పిఎల్ మార్కెట్ వృద్ధిని అంచనా వేస్తున్నామని, ఈ మార్కెట్ కస్టమర్ బేస్‌తో పెరుగుతోందని క్యాషిఫై వద్ద ఫోన్‌షాప్ వైస్ ప్రెసిడెంట్ అయిన హితాషి గార్గ్ అంటున్నారు. రాబోయే కాలంలో ఇది పది రెట్లు ఎక్కువ పెరగవచ్చు. కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్ నుండి వచ్చిన డేటా ప్రకారం, కనీసం 46 శాతం మంది వినియోగదారులు నెలలో ఒకటి కంటే ఎక్కువసార్లు ఈ చెల్లింపు ఎంపికను ఎంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ టూల్‌కు ఆదరణ పెరుగుతోందని, ప్రజలు ఆన్‌లైన్ షాపింగ్, ఆహారం, రోజువారీ వస్తువులతో సహా ఇతర బిల్లుల చెల్లింపులకు దీనిని ఉపయోగిస్తున్నారని ఆయన అన్నారు.

చిన్న పట్టణాలలో పెరుగుతున్న వినియోగదారులు

బిఎన్పిపిఎల్ సదుపాయంలో గరిష్ట కస్టమర్ బేస్ భారతదేశంలోని చిన్న నగరాల్లో కనిపిస్తోంది,. ఇక్కడ క్రెడిట్ కార్డ్ వ్యాప్తి తక్కువగా ఉంటుంది. లేజీపేలో వీటికి డిమాండ్‌లో దాదాపు 60 శాతం టైర్-2, టైర్-3 నగరాల నుండి వస్తోంది. అయితే, ఈ ఫీచర్ కారణంగా పెద్ద మార్పు కూడా కనిపిస్తుంది. దీని పట్ల ఉన్న క్రేజ్ కారణంగా ప్రజలు ఈ సదుపాయాన్ని తీసుకోవడానికి స్మార్ట్‌ఫోన్‌లను తీసుకోవడం, తద్వార చిన్న పట్టణాల్లో ఇంటర్నెట్ వ్యాప్తి పెరుగుతోంది. ఇది కాకుండా, ఆన్‌లైన్ షాపింగ్‌లో కూడా గణనీయమైన పెరుగుదల ఉంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ప్రధాన షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లు వాటి స్వంత బిఎన్పిపిఎల్ చెల్లింపు ఎంపికలను కలిగి ఉండడం చూస్తే, ఈ సౌకర్యంపై డిమాండ్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. అమెజాన్ పే లేటర్ గత ఏడాది జూలైలో ఇప్పటికే 20 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌ల వృద్ధిని సాధించింది. అదే సమయంలో, ఫ్లిప్‌కార్ట్ తమకు 10 మిలియన్ల మంది కస్టమర్‌లు ఉన్నారని, వారు పే-లేటర్ ఎంపికను స్వీకరించవచ్చని చెప్పారు.

నిపుణులు ఆందోళన

ఈ సదుపాయం ఉపయోగం నిరంతరం పెరుగుతుండగా, వీటి పట్ల వియోగదారులు జాగ్రత్తగా ఉండకపోతే, తెలియకుండానే వారు అప్పుల ఊబిలో చిక్కుకుంటారని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కస్టమర్ అవగాహనలో పెద్ద మార్పును చూశామని, యువత క్రెడిట్‌పై కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నట్లు తెలుస్తోందని నిపుణులు అంటున్నారు. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేయగలదని అంటున్నారు. ప్రతి బిఎన్పిపిఎల్ లావాదేవీని వ్యక్తిగత రుణంగా భావించాలి. మరో మాటలో చెప్పాలంటే, మీరు ఈ ఎంపికకు సైన్ అప్ చేసినప్పుడు, మీరు షార్ట్ టర్మ్ లోన్ కోసం సైన్ అప్ చేస్తున్నారు అన్నట్టే. దీంతో పాటు క్రెడిట్‌లు కూడా మినిమమ్ వెరిఫికేషన్‌తో ఇచ్చినా అధికంగా ఖర్చు చేసే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.

ఈ స్కీమ్ ఎలా పని చేస్తుంది

బై నౌ పే లేటర్ స్కీమ్ ద్వారా ఫిన్‌టెక్ కంపెనీలు వినియోగదారులకు రుణాలు ఇస్తాయి, క్రెడిట్ కార్డ్ లాగా ముందుగా కొనుగోలు చేసి తర్వాత చెల్లించే సౌకర్యాన్ని అందిస్తాయి. ePaylater, Lazypay, Simple వంటి అనేక ఫిన్‌టెక్ కంపెనీలు ఉన్నాయి. ఇవి వినియోగదారులకు షాపింగ్ చేసి తర్వాత చెల్లించే అవకాశాన్ని కల్పిస్తాయి. దీని కింద ఒక బిల్లింగ్ సైకిల్‌లో చేసిన కొనుగోళ్లు పెరుగుతూనే ఉంటాయి, దీనికి మీరు తర్వాత చెల్లించాలి. నివేదిక ప్రకారం, ఈ సౌకర్యం ద్వారా వినియోగదారుడు రూ. 100 నుండి రూ. 5000 వరకు చిన్న లావాదేవీలు చేయవచ్చు. కానీ సకాలంలో చెల్లింపు చేయడంలో విఫలమైతే, కంపెనీ మొత్తం బకాయి మొత్తంలో గరిష్టంగా 30 శాతాన్ని పెనాల్టీగా రికవరీ చేయవచ్చు.

పర్సనల్ లోన్ లాగా వడ్డీ చెల్లించాలి

పర్సనల్ లోన్ లాగానే బిఎన్పిపిఎల్ లోన్ కొన్ని సెకన్లలో లభిస్తుంది. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది అప్పుల ఊబి, మీరు నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందుల్లో పడతారు. సకాలంలో రుణం చెల్లించకపోతే అపరాధ రుసుము, ఆలస్య రుసుము, వడ్డీ తదితరాలు అన్నీ కలిపితే మీరు తీసుకున్న రుణం పెద్దదిగా మారుతుంది. ఫిన్‌టెక్ సంస్థలు వ్యక్తిగత రుణాలను వివిధ మార్గాల్లో ఈ విధంగా అందిస్తున్నాయి. ఈ రుణం తీసుకునే ముందు వినియోగదారులు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. బిఎన్పిపిఎల్ వ్యక్తిగత రుణం వంటి అధిక వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. బిఎన్పిపిఎల్పై ప్రాసెసింగ్ ఫీజుతో పాటు కంపెనీలు 24 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తున్నాయనే విషయం గమనించాలి. 


Spread the love

Leave a Comment

error: Content is protected !!